న్యూదిల్లీ: దేశంలో కరోనా కేసుల వ్యాప్తి భారీగా పెరుగుతోంది. మంగళవారం దేశంలో 1,94,720 కొత్త కేసులు నమోదు కాగా, బుధవారం ఆ సంఖ్య మరింత భారీగా పెరిగి 2,47,417 కేసులు నమోదయ్యాయి. మంగళవారం కన్నా బుధవారం 27 శాతం కేసులు అధికంగా వచ్చాయి. నిన్న కరోనా నుంచి 84,825 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 11,17,531 మంది కరోనాకు హోం క్వారంటైన్, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రతిరోజు పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు పెరిగింది. నిన్న కరోనాతో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 4,85,035కు చేరింది.