తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి
ప్రభుత్వం ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్
ములుగు: తాటి చెట్టుపై నుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఎల్బాక గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బుర్ర కనకయ్య(53) అనే గీత కార్మికుడు తన దిన చర్యలో భాగంగా తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.
వారి కుటుంబానికి స్థానిక సర్పంచ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఆయనకు భార్య కనకమ్మ ముగ్గురు కొడుకులు ఉన్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox