టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా
ప్రస్తుతం అశ్విన్ క్వారంటైన్లో ఉన్నట్లు టీమిండియా వర్గాల వెల్లడి
హైదరాబాద్: టీమిండియా(Team India) స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదవ టెస్టు మ్యాచ్ కోసం యూకేకు రవిచంద్రన్ వెళ్ళలేదు. ప్రస్తుతం అశ్విన్ క్వారంటైన్లో ఉన్నారని, కరోనా తగ్గిన తర్వాత మాత్రమే స్క్వాడ్లో చేరతారని టీంఇండియా వర్గాలు తెలిపాయి. ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్ కోసం భారత్ క్రికెట్ జట్టు ఈ నెల 16వతేదీన యూకేకు వెళ్లింది. కరోనా సోకడంతో అశ్విన్ విమానం ఎక్కలేక పోయారు.
జులై 1 నుండి టెస్టు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మ్యాచ్ మెుదలయే లోపు అశ్విన్ కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. దక్షిణాఫ్రికాతో టీ20 ముగించుకుని రాహుల్ ద్రవిడ్, రిషబ్ పంత్,శ్రేయాస్ అయ్యర్లు లండన్ చేరుకున్నారు. మంగళవారం లీసెస్టర్లో అడుగుపెడుతారు. మరో వైపు జట్టు సభ్యులకు మూడు రోజుల విశ్రాంతి ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ఐర్లాండ్-బౌండ్ స్క్వాడ్ జూన్ 23 లేదా 24 న డబ్లిన్కు బయలుదేరనుంది.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox