పార్కింగ్ ఫీజుపై మరోసారి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
పార్కింగ్ దందా నివారణపై ఎందుకు లేదో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశం
హైదరాబాద్: మాల్స్, సినిమాహాల్లు, వ్యాపార సముదాయాల్లో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుండటంపై ప్రభుత్వం పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం పార్కింగ్ దందాపై విచారణ జరిపింది. సీహెచ్ మదన్ మోహన్ వర్సస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కేసులో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని హైకోర్టు స్పష్టతనిచ్చినప్పటికీ భారీగా వసూలు చేస్తున్నారు.
దీనిపై మరోసారి న్యాయమూర్తులు జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి ప్రధానన్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం వినియోగదారులకు పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత భవనాల యజమానులపై ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు ప్రభుత్వం అమలు చేయటం లేదని వివరించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox