అమెరికా(America)లో కాల్పులు.. తెలంగాణ సాఫ్ట్వేర్ ఉద్యొగి మృతి
సాయిచరణ్ భారత్ మృత దేహాన్ని భారత్ రప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
నల్గొండ: అమెరికా(America) మేరీల్యాండ్లో జరిగిన కాల్పుల్లో నల్గొండకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సాయిచరణ్ (26) దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. గత రెండేళ్లుగా సాయిచరణ్ అమెరికా(America)లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. కాల్పులకు పాల్పడింది ఓ నల్లజాతీయుడి అని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం స్నేహితుడిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి కారులో వస్తుండగా.. ఓ నల్లజాతీయుడు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయిచరణ్ భారత్ మృత దేహాన్ని భారత్ రప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox