బైకును ఢీకొన్న లారీ.. బంగారు వస్తువుల తయారీదారుడు మృతి
నాగరాజు మృతితో దుళ్ళలో విషాధఛాయలు
కోనసీమ జిల్లా: బైకును లారీని ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మండపేట మండలంలోని ఇప్పనపాడు వద్ద మంగళ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడియం మండలం, మురమండ గ్రామానికి చెందిన నాగరాజు(38) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... కడియం మండలం, మురమండ గ్రామానికి చెందిన అలక నాగరాజు రాజమహేంద్రవరంలో బంగారు దుకాణంలో వస్తువులు తయారు చేస్తుంటాడు. సోమవారం రాజమండ్రి నుంచి, మురమండ ఇంటికి వచ్చి మంగళవారం బంగారు వస్తువులు రాయవరం మండలం సోమేశ్వరంలో ఆందజేసి తిరిగి రాజమండ్రి బైక్ పై వెళ్తుండగా తాపేశ్వరం ఇప్పనపాడు రోడ్డులో లారీ ఢీకొట్టింది. నాగరాజు మృతితో దుళ్ళలో విషాధఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటనకు సబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివకృష్ణ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox