అధ్వాన్నంగా లింబూర్, వాడీ రోడ్డు.. అత్యవసర పరిస్థితిలో కష్టమే..
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాడీ గ్రామస్థులు
లింబూర్: మద్నూర్ మండలంలోని లింబూర్ నుంచి వాడీకి వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారింది. "లింబూర్ నుంచి వాడీకి మట్టిరోడ్డు కవటంతో అడుగు తీసి అడుగు వేయడానికి కష్టంగా ఉంది. ప్రభుత్వాలు మారినా తమ గ్రామానికి రోడ్డు పరిస్థితి మాత్రం మారడం లేదంటూ" స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత వాడ అయినందుకే వాడీని పట్టించుకోవటం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. గర్భిణి స్త్రీలు ఆసుపత్రికి వెళ్లేలోపు ప్రాణాలు పోయేలా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరితగతిన తమ గ్రామానికి రోడ్డు వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వానాకాలం ప్రారంభం కావటంతో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox