శోక సంద్రంలో నందమూరి కుటుంబం..ఇంతలోనే విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు
ఉమామహేశ్వరి మృతి పై పలు అనుమానాలున్నాయన్న ఎంపీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ స్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరీ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఉమామహేశ్వరీ అంత్యక్రియలు జరిగాయి. ఉమామహేశ్వరి మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, అంత్యక్రియలు పూర్తికాకముందే దివంగత ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి మృతి పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఉమా మహేశ్వరి మరణంపై అనుమానాలు ఉన్నాయని ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'ఉమామహేశ్వరి మరణంపై అనుమాలున్నాయి. మా చంద్రన్న వేధించాడా? లేదా ఇంకెవరైనా చంపి ఉరివేశారా? ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదు. సీబీఐ దర్యాప్తు కోరి నిజం నిజం నిగ్గు తేల్చాలి బాబన్నా` అని ఎంపీ ట్వీట్ లో పేర్కొన్నారు.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox