ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ(RBI) కీలక నిర్ణయం
రెపో రేటు(Repo rate) 50 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ(RBI)
ముంబయి: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ(RBI) వెల్లడించింది. అయితే రెపో రేటు(Repo rate)ను 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను ఇవాళ ఆర్బీఐ(RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు.
బ్యాంకులకు ఆర్బీఐ(RBI) ఇచ్చే వడ్డీలను రెపో రేటు(Repo rate)గా పిలుస్తారు. రెపో రేటు(Repo rate) పెంచడం అంటే, ఇక కమర్షియల్ బ్యాంకులు, లేదా వ్యక్తులకు రుణాలు తీసుకోవడం భారంగా మారుతుంది. 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో.. రెపో రేటు(Repo rate) 5.4 శాతానికి చేరినట్లు శక్తికాంత్దాస్ వెల్లడించారు. రెపో రేటు(Repo rate)ను రిజర్వు బ్యాంక్ వరుసగా మూడవసారి పెంచింది.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox