కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్(Dasoju Sravan)రాజీనామా
పీసీసీ అధ్యక్షుడి నిర్ణయాలతో పార్టీలో కలహాలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మరో నాయకుడు దూరమయ్యారు. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా, తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్(Dasoju Sravan)పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సరైన న్యాయం జరగట్లేదనే బాధతో శ్రవణ్ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి ఆయన గాంధీ భవన్కు దూరంగా ఉంటున్నారు. తనను సంప్రదించకుండానే రేవంత్ రెడ్డి ఏకపక్షంగా పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం కూడా శ్రవణ్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు సమాచారం. గత వారం రోజుల్లోనే ఇద్దరు నాయకులు కాంగ్రెస్ కు దూరం. దీంతో పీసీసీ అధ్యక్షుడి నిర్ణయాలతో పార్టీలో కలహాలు రేగుతున్నాయి.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox