కర్ణాటక ముఖ్యమంత్రికి కరోనా(Corona) పాజిటివ్
దిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్న బసవరాజ్ బొమ్మై(Basawaraj Bommai)
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Basawaraj Bommai) కరోనా(Corona) బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న తాను కొవిడ్ టెస్టులు చేయించుకోగా, కరోనా(Corona) పాజిటివ్గా నిర్ధారించబడిందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Basawaraj Bommai) తెలిపారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకొని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా(Corona) బారిన పడిన నేపథ్యంలో దిల్లీ టూర్ను వాయిదా వేసుకుంటున్నట్లు బసవరాజ్ బొమ్మై(Basawaraj Bommai) పేర్కొన్నారు. జులై 25, 26 తేదీల్లో బొమ్మై దిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమంలో కర్ణాటక బొమ్మై పాల్గొన్నారు.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox