కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి(Vice President) ఎన్నికలు
దిల్లీలోని పార్లమెంట్ హాలులో ఓటేసిన ప్రధాని మోదీ
న్యూదిల్లీ: ఉపరాష్ట్రపతి(Vice President) ఎన్నికకు ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు ప్రముఖ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దిల్లీలోని పార్లమెంట్ హాలులో ఏర్పాటు చేసిన బూత్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీలు కూడా తమ ఓటును వేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనున్నది. 780 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది.
దీంట్లో 543 మంది లోక్సభ, 245 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అయితే 36 మంది తృణమూల్ ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉండనున్నారు. రాజ్యసభలో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో 744 మంది ఎంపీలు ఓటు వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఉపరాష్ట్రపతి(Vice President) ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, విపక్షాల అభ్యర్థిగా మార్గరేట్ అల్వాలు పోటీపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన ఉద్దవ్ పార్టీలు మార్గరేట్ అల్వాకు మద్దతు ఇస్తున్నారు. అయితే ధన్కర్ ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox