కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిన భారత్.. 61 పతకాలతో నాలుగో స్థానం
భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు
బర్మింగ్హామ్: ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడలు(Commonwealth Games)నేటితో ముగిశాయి. తొలిసారిగి ప్రవేశపెట్టిన క్రికెట్ లో భారత మహిళలకు రజత పతకం లభించగా, స్వ్యాష్ లో భారత ఖాతాలో రెండు కాంస్య పతకాలు చేరాయి. మొత్తానికి కామన్వెల్త్ క్రీడలు(Commonwealth Games)ముగిసే నాటికి భారత్ రికార్డు స్థాయిలో 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు సాధించింది. మొత్తం 12 పతకాలతో భారత రెజ్లర్లు మెరిశారు. రెజ్లింగ్ లో భారత్ కు 6 స్వర్ణాలు, ఒక రజతం, 5 కాంస్యాల పతకాలు లభించాయి. బాక్సింగ్ లో 3 స్వర్ణాలు, ఒక రజతం, 3 కాంస్యాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ లో 3 స్వర్ణాలు సహా 6 పతకాలు సాధించింది.
షట్లర్ల ఖాతాలో 3 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యా పతకాలు ఉన్నాయి. భారత వెయిట్ లిఫ్టర్లు మొత్తంగా 10 పతకాలు సాధించారు. అందులో 3 పసిడి, 3 రజతం, 4 కాంస్యాలున్నాయి. టేబుల్ టెన్నిస్ లో భారత్ కు 4 స్వర్ణాలు సహా 7 పతకాలు వచ్చాయి. అథ్లెంటిక్స్ విభాగంలో భారత్ కు మొత్తం 8 పతకాలు వచ్చాయి. ఒక స్వర్ణంతో పాటు 4 రజతాలు, 3 కాంస్యాలు నెగ్గిన భారత్ అథ్లెట్లు. లాన్స్ బౌల్స్ క్రీడల్లో భారత్ కు ఒక స్వర్ణం, ఒక రజతం వచ్చాయి. పారా పవర్ లిఫ్టింగ్ లో భారత్ ఖాతాలో ఒక స్వర్ణం చేరింది. జూడోలో భారత్ కు 2 రజతాలు, ఒక కాంస్యం సహా మొత్తం 3 పతకాలు వచ్చాయి. హాకీలో ఒక రజతం, ఒక కాంస్యం సహా భారత్ 2 పతకాలు నెగ్గింది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox