హైదరాబాద్: సీపీజీఈటీ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు సీపీజీఈటీ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చేతుల మీదుగా ఆయన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 67,027 మంది దరఖాస్తు చేసుకోగా, 57,262 మంది హాజరయ్యారని సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox