భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర
కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: 2040 నాటికి భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెరాస ప్రభుత్వంపై ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. పీఎఫ్ఐను ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నాగోల్ వద్ద పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ.. జిమ్, స్వచ్ఛంద సంస్థల పేరుతో పీఎఫ్ఐ విస్తరిస్తోందని.. హిందువుల తలలు నరుకుతున్న పీఎఫ్ఐ సంస్థ తెలంగాణ విస్తరిస్తుంటే కేసీఆర్ కు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. ఎంఐఎం కనుసన్నల్లో పీఎఫ్ఐ నడుస్తోందని తెలిపారు. ఎన్ఐఏ వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్ఐ గురించి ప్రభుత్వానికి సోయి ఎందుకు లేదని నిలదీశారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox