జల్సాలకు అలవాటుపడి షాపింగ్ మాల్ ప్రాంతాల్లో బైక్ ల చోరీ

23 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

నంద్యాల: జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బైకులు దొంగలించడమే వృత్తిగా ఎంచుకొని ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతోంది. జిల్లాలోని కోయిలకుంట్లకు చెందిన కొందరు రాయలసీమ ప్రాంతంలోని కడప, కర్నూలు నంద్యాల తదితర జిల్లాల్లో షాపింగ్ లు, బస్టాండ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బైకులను దొంగిలించి వాటిని విక్రయించిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ముఠాను కోవెలకుంట్ల పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 23 బైకులను స్వాధీనం చేసుకున్నారని ఆళ్లగడ్డ డిఎస్పి వెంకటరామయ్య తెలిపారు.

డిఎస్పి వెంకటరామయ్య తెలిపిన వివరాలు మేరకు అనంతపురం జిల్లా కుందనకోట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కోయిలకుంట్ల సర్కిల్లోని కొలిమిగుండ్ల, ఆకుమల సంజామల ప్రాంతానికి చెందిన మరో ఐదుగురు ఒక ముఠాగ ఏర్పడి బైకులను దొంగలిస్తూ వాటిని ఒక చోట చేర్చి వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో వాటాలుగా పంచుకొని జల్సాలు చేస్తున్నారు.

కొంతకాలంగా ఈ బైకు దొంగతనాలపై బాదితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నారాయణరెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి విచారణ చేపట్టి ముఠాకు సంబంధం ఉన్న కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారని ఇందులో మొత్తం ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం