విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: టీడీపీ
గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించిన తెదేపా నేతలు
అమరావతి: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని తెలుగు దేశం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గవర్నర్ బిస్వభూషన్ హరి చందన్ ను కలిసి వినతిపత్రం అందించారు. గవర్నర్ ను కలిసిన వారిలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపిలు కేశినేని శ్రీనివాస్(నాని), కనకమేడల రవీంద్ర మరియు టీడీపి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వర్ల రామయ్య పయ్యావుల కేశవ్, బచ్చుల అర్జునుడు, ఎం వి సత్యనారాయణ రాజు, బీటి నాయుడు, వెలగపూడి రామకృష్ణ, వర్ల రామయ్య నక్కా ఆనందబాబు, బెందాలం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox