విజయవాడ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రుల తేదీలు ఖరారు

తొలిరోజు 26 (సోమవారం)న స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవిగా అమ్మవారు

అమరావతి: దసరా పండుగ సమీపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రులు  కార్యక్రమాల షెడ్యూల్ ను ఆలయ నిర్వాహకులు ఖరారు చేశారు. పది రోజుల పాటు అమ్మవారికి  అలంకారాలు, కట్టే చీర రంగు, నైవేద్యం తదితర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను ఆలయాధికారులు వెల్లడించారు. తొలిరోజు 26 (సోమవారం)న స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవిగా, రెండోరోజు 27న లేత గులాబీ రంగు చీర ధరించి బాలాత్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు.

ఇక మూడో రోజు 28న శ్రీ గాయత్రీ దేవిగా, 29న శ్రీ అన్నపూర్ణ దేవిగా, 30న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి గా భక్తులకు అమ్మవారు కనిపిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇక అక్టోబర్‌ 1న శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో దర్శనమిస్తారని వెల్లడించారు. 2న శ్రీ సరస్వతి దేవిగా 3న శ్రీ దుర్గా దేవిగా 4న శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా, 5న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు కనువిందు చేయనున్నారని వివరించారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం