విజయ డెయిరీ అభివృద్ధి పథంలో నడుస్తోంది: మంత్రి తలసాని

విజయ డెయిరీని నెంబర్‌వన్‌ స్థానంలో తీసుకెళ్తామన్న మంత్రి తలసాని

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయ డెయిరీ అభివృద్ధి పథంలో నడుస్తోందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నగరంలోని ఎన్‌టీఆర్‌ పార్క్, లుంబినీ పార్క్‌ల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విజయ ఐస్ క్రీమ్ పార్లర్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...రూ.750 కోట్ల టర్నోవర్‌తో దూసుకెళ్తుందన్నారు. గతంలో విజయ డెయిరీ ఉత్పత్తులు అందరికి అందుబాటులోకి తీసుక రాలేదు.

ఇప్పుడు 1000 అవుట్ లెట్స్ ఎర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. విజయ డెయిరీని దేశంలోనే నెంబన్‌ వన్‌ స్థానానికి తీసుకెళ్తామని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, తదితరులు ఉన్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం