ఒకే బస్సులో 80 మంది విద్యార్థుల తరలింపు.. శ్రీ చైతన్య కాలేజీ నిర్వాకం

ఉండవల్లి గ్రామంలో కాలేజీ బస్సును అడ్డుకున్న తెదేపా నాయకులు, తల్లిదండ్రులు

గుంటూరు: అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ అందినకాడికి వసూలు చేస్తుంటాయి విద్యాసంస్థల యాజమాన్యం. కానీ తీర వసతుల విషయానికి వస్తే మాత్రం చేతులెత్తేస్తారు. తాజాగా ఒక్క బస్సులో 80 మందికి పైగా విద్యార్థులను తరలిస్తున్న ఉండవల్లిలో శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సాధారణంగా అయితే బస్సుకు 50 మంది విద్యార్థుల వరకే పరిమితం ఉంటుంది. కానీ శ్రీ చైతన్య యాజమాన్యం మాత్రం 70 నుంచి 80 మంది విద్యార్థులను బస్సు లో ఎక్కిస్తున్నారు అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా విద్యార్థులు, విద్యార్థినిలు ఒకే బస్సులో కిక్కిరిసి ఎక్కించడంపై విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులు తమ ఆవేదన తల్లితండ్రులకు చెప్పగా.. తల్లిదండ్రులు మంగళగిరి నియోజకవర్గ తెదేపా (TDP) కి చెందిన టీఎన్ టీయూసీ (TNTUC) అధికార ప్రతినిధి కునపరెడ్డి రమేష్, తెలుగు యువత నాయకుడు బొబ్బ రవితేజ వారితో కలిసి ఉండవల్లి గ్రామంలో చైతన్య కాలేజీ బస్సు అడ్డుకుని ఆందోళనకు దిగారు. 

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం