ఎద్దుల బండిని ఢీకొన్న ద్విచక్ర వాహనం.. ఒకరు మృతి

నెల్లూరులో ఘటన

నెల్లూరు: ఎద్దుల బండిని ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మకూరు చల్లా వీధిలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వినయ్ అనే యువకుడు ఎద్దుల బండిని ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన వినయ్ మృతి చెందాడు. వినయ్ విద్యుత్ సబ్ స్టేషన్ లో షిప్ట్ ఆపరెటర్ గా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం వినయ్ కూతురి పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకున్నాడని ఇవాళ ఆయన మరణ వార్త వినడం తీవ్ర బాధను కలిగిస్తుందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. 

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం