యూట్యూబ్​లో చూసి బైక్ చోరీలు.. 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మియాపూర్: యూట్యూబ్ లో చూసి పార్కింగ్ చేసిన బైకులను దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులన పోలీసులు పట్టుకున్నారు. బైకు చోరీ కేసును చేధించిన మియాపూర్ సీఐ తిరుపతి రావు, డీఐ కాంత రెడ్డి, సిబ్బందిని మాదాపూర్ డీసీసీ అభినందించారు. మాదాపూర్ డీసిపి శిల్పవల్లి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన రాజు రెహమాన్ (22), ఇమోన్ హక్యూ మొండల్ (25) ఇద్దరు చందానగర్ లోని నాగార్జున గ్రామర్ స్కూల్ వద్ద నివాసముంటూ స్విగ్గీ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారు.

దాంతో వచ్చే డబ్బులు సరిపోక విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకున్న ఇద్దరు బైక్ దొంగతనాలు ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి, నేర్చుకొని దొంగతనాలు చేశారు. పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను హ్యండీల్ లాక్ విరగ్గోట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. ఇప్పటికే నిందితుల పై మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, కేపిహెచ్‌బి, రాయదుర్గం, బాచుపల్లి, ఆర్‌సి పురం, సంగారెడ్డి రూరల్, సంగారెడ్డి టౌన్, పటాన్ చెరు, అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు ఉన్నాయని వారు తెలిపారు. నిందితుల వద్ధ నుండి 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox