భాజపా (BJP)ని వెన్నుపోటు పొడిచి లాలూ ఒడిలో కూర్చున్నాడు నితీశ్: అమిత్ షా

నితిశ్ కుమార్ పార్టీని విడిన తర్వాత మొదటి సారి బీహార్ కు అమిత్ షా

పాట్నా: నితీశ్ కుమార్ ప్రధాని కావాలనే తపనతో భాజపా (BJP)ని వెన్నుపోటు పొడిచారని,  ఆర్ జెడి, కాంగ్రెస్ తో చేతులు కలిపారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో భాజపా (BJP) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) నుండి సిఎం నితీష్ కుమార్ విడిపోయిన తర్వాత బీహార్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా మొదటిసారి పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... “నితీష్ కుమార్‌కు ఎలాంటి సిద్ధాంతాలు లేవు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో ‘మహాగట్  బంధన్’ తారుమారు అవుతుంది. 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత భాజపా (BJP) పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.  బీహార్ సిఎంకు ఒకే ఒక లక్ష్యం ఉందని… అది తన గద్దె పదిలంగా ఉండాలన్నది’’ అని షా చెప్పుకొచ్చారు. ఇంకా షా మాట్లాడుతూ.. రాజకీయ పొత్తులు మార్చుకుని నితీశ్ ప్రధాని కాగలరా?’’ అని ప్రశ్నించారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం