రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

మరమ్మత్తుల కారణంగా విద్యుత్ ఉండని ప్రాంతాలు

మాదాపూర్: రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అయ్యప్ప సోసైటీ సబ్ స్టేషన్ 33/11 మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని అల్లాపూర్ ఏఈ శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్‌బిఐ కాలనీ, సెంచరి హిల్స్, బాలాజీ టెంపుల్, అయ్యప్ప సోసైటీ, అప్న బజార్ వెనుక వైపు, సూర్య కార్యలయం వెనుక వైపు, పర్వత్‌నగర్ క్రాస్ రోడ్డు, సర్వే ఆఫ్ ఇండియా, చందనాయక్ తండా, ఎన్ కన్వెన్షన్ వెనుకల వైపు, సిజిఆర్ వెనుకాల కాలనీ, గాయత్రినగర్, శివ బస్తీ, లక్ష్మినగర్, ఫ్రెండ్స్ కాలనీ తదితర కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం