కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం

భయాందోళనకు గురైన వైద్య సిబ్బంది, రోగులు

కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం రేపింది . దవాఖానలోని ఎక్స్‌రే గదిలో పాము కనిపించడంతో వైద్యులు, సిబ్బంది, రోగులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పామును పట్టే వ్యక్తిని పిలిపించారు. అతడు పామును పట్టుకుని దూరప్రాంతంలో వదిలివేశారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలు ముళ్ల పొదలతో పేరుకుపోవడంతో తరుచూ విషపురుగులు దవాఖానాలోకి ప్రవేశిస్తున్నాయని రోగులు వెల్లడించారు. ఆసుపత్రికి ప్రతిరోజూ మూడు వందల మంది రోగులు, వారి బంధువులు వస్తుంటారని రోగులు వెల్లడించారు. విష పురుగులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox