భారత క్రికెటర్లకు రామ్ చరణ్ విందు ఆతిథ్యం.!

హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ఆటగాళ్లు హాజరైనట్లు సమాచారం

హైదరాబాద్: ప్రముఖ తెలుగు కథానాయకుడు రామ్ చరణ్ ఇంట భారత క్రికెటర్లు విందును ఆరగించినట్లు తెలుస్తోంది. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత క్రికెటర్లను రామ్ చరణ్ ఈ సందర్భంగా తన ఇంటి రావాలని ఆహ్వానించారు.

దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ఆటగాళ్లు రామ్ చరణ్ నివాసానికి వెళ్లారు. క్రికెటర్లను సన్మానించి వారితో రామ్ చరణ్ కుటుంబసభ్యులు ముచ్చటించారు. అక్కడ వారికి చరణ్ ప్రత్యేక విందును ఆరగించినట్లు సమాచారం. చిరంజీవి కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు సమాచారం. కాగా, ఈ ఫొటోలను రామ్ చరణ్ అధికారికంగా విడుదల చేయనున్నట్టు తెలిసింది.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం