మరోసారి వాయిదా పడిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్

అక్టోబరు 11 నుంచి తిరిగి ప్రారంభం

హైదరాబాద్: మరోసారి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడింది. రేపు (బుధవారం) జరగాల్సిన  కౌన్సెలింగ్ వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించగా, అక్టోబరు 11 నుంచి తిరిగి ప్రారంభమవుతుందని వారు పేర్కొన్నారు.  ఫీజులు ఒక కొలిక్కి రాకపోవడంతోనే రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడినట్లు సమాచారం. కాగా, అక్టోబర్ 11, 12న రెండో విడత స్లాట్ బుకింగ్ మొదలవుతుంది. అలాగే అక్టోబర్ 12న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని అధికారులు తెలిపారు. వచ్చే నెల 12,13 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు, అనంతరం 16వ తేదీన ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరుగనున్నాయి. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం