ఆంధ్రప్రదేశ్ కు మరో మూడు రోజులపాటు వర్ష సూచన

భారత వాతావరణ శాఖ వెల్లడి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ వరకు విస్తరించి ఉన్నందున మంగళవారం నుంచి మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ మేరకు అమరావతిలోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అవసరం ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు విజ్ఞప్తిచేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండాలని అధికారులు సూచించారు. 

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం