ఆన్లైన్ లోన్ వేధింపుల కేసులో మరో ఐదుగురు అరెస్టు.. ఒకరికొకరు తెలియకుండానే కార్యకలాపాలు

నిందితులను పట్టుకునేందుకు కృష్ణాజిల్లా పోలీసులు తీవ్ర ప్రయత్నం

మచిలీపట్నం: ఆన్లైన్ లోన్ వేధింపుల కేసులో మరో ఐదుగురిని కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇదే కేసులో గత వారం రోజుల క్రితమే ఐదుగురిని అరెస్ట్ చేశారు. లోతైన విచారణ చేపట్టిన కృష్ణా జిల్లా పోలీసులు వారం రోజులు తిరిగి రాక ముందే  మరో ఐదుగురు అరెస్ట్ చేశామన్న ఎస్పీ పి జాషువా వెల్లడించారు. లోన్ యాప్ ఏజెంట్ల అరెస్ట్ లపై మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఎఎస్పీ రామాంజనేయులు నేతృత్వంలోని సిట్ బృందం నిందితుల్ని దిల్లీలో అరెస్ట్ చేశామన్నరు. 

అరెస్ట్ అయిన నిందితులు ఒకరికొకరు తెలియకపోవడం ఆశ్చర్యకరమని వారు పేర్కొన్నారు. ఆన్లైన్ లోన్ మంజూరైన తర్వాత ఈఎంఐల రూపంలో వసూళ్లు చేసిన మొత్తాన్ని వేర్వేరు ఎకౌంట్లకు ఎవరి వాటాలను సర్దుబాటు చేయడం ఈ ముఠా పని. నిందితులు వినియోగిస్తున్న సర్వర్లు చైనా, పాకిస్థాన్, ఇండియాలోని కొన్ని ప్రాంతాలుగా గుర్తించామని పోలీసులు స్పష్టం చేశారు. రూ. 23.33 లక్షల బ్యాంక్ ఖాతాలో నగదును జప్తు చేశామని ఎస్పీ తెలిపారు

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం