పాపాల పరిహారం కోసమే యాదాద్రికి కేసీఆర్ కానుకలు: పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah)

కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah)

యాదాద్రి భువనగిరి: పాపాల పరిహారం కోసమే మాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకలు సమర్పిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah) ఆరోపించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న కేసీఆర్ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాన్ని అందజేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah) మాట్లాడుతూ.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లు కేసీఆర్ తీరు ఉందని లక్ష్మయ్య తీవ్ర విమర్షలు గుప్పించారు. దేశంలో కేసీఆర్ అంత దోపిడీ ఏ ముఖ్యమంత్రి చేయలేదని ఆయన పేర్కొన్నారు. దోపిడీ చేసి జాతీయ పార్టీ పెడతానంటే దేవుడు వరం ఇస్తాడా ? అంటూ ఆయన ప్రశ్నించారు. వరంగల్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఒక్క పైసా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. టెక్ట్ర్స్ టైల్స్ పార్కు హామీ ఎటుపోయిందో అర్థం కావట్లేదని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా వరంగల్ ఎయిర్ పోర్టుకు పైసా కూడా మంజూరు చేయలేదు. జాతీయ పార్టీ పేరుతో విమానం కొనడం కేసీఆర్ దోపిడికి నిదర్శనమని పొన్నాల వ్యాఖ్యానించారు. 

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం