కేసీఆర్ ముందు స్వరాష్ట్రంలో ప్రజల పరిస్థితి గుర్తించాలి: కిషన్ రెడ్డి (Kishan Reddy)

రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి (Kishan Reddy) ధ్వజం

హైదరాబాద్: బయ్యారంలో ముడి ఇనుము నాణ్యమైనదిగా లేనట్లు ఎనిదేళ్ల క్రితమే నిపుణుల కమిటి నివేదిక ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)  స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి పార్లమెంటులోనూ చెప్పారని అయినా స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తోందని కిషన్ రెడ్డి (Kishan Reddy)  పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలవైపు మొగ్గు చూపుతున్న కేసీఆర్ ముందు స్వరాష్ట్రంలో ప్రజల పరిస్థితి గుర్తించాలని కిషన్ రెడ్డి (Kishan Reddy)  సూచించారు.

బయ్యారంలో ముడి ఇనుము నాణ్యమైనదిగా లేదని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా  నివేదిక ఇచ్చిందని అక్కడ పరిశ్రమ పెడితే పోటీలో నిలవలేదని అభిప్రాయ పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)  పునరుద్ఘటించారు. కేంద్రం సహకరించకపోయినా బయ్యారంలో ఉక్కు కర్మాగారం కట్టి తీరతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని గుర్తు చేశారు. నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పినా కూడా తెరాస ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తోందని కిషన్ రెడ్డి (Kishan Reddy)  దిల్లీలో మండిపడ్డారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం