ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం
శుక్రవారం అర్థరాత్రి జీవో నంబర్ 33 జారీ
హైదారాబాద్: షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)లకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 33 జారీ చేసింది. దీంతో రాష్ట్ర గిరిజనులకు శనివారం నుంచి కొత్త రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. గత ఎన్నికల సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం గిరిజనులకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే.
సెప్టెంబర్ 17వ తేదీన ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభించిన సందర్భంగా ఈ అంశంపై మరోసారి విస్పష్ట ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పెంపు అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎస్ చెల్లప్ప నేతృత్వంలో కమిషన్ ఇచ్చిన నివేదికను 2017లో ఏప్రిల్ 15న రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఆ తర్వాతి రోజే శాసనసభలో తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవటంతో గిరిజనులకు కేసీఆర్ రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox