అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనించి తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు వస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కూడా పడతాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర తీరంలో 65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox