తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తితిదే అధికారులు పేర్కొన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకలు రూ.4.35 కోట్లు వచ్చిందని వెల్లడించారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు వీలుగా డిసెంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈనెల 24 న ఉదయం 10 గంటలకు తితిదేఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని తితిదేఅధికారులు కోరారు. ఇదిలా ఉండగా, నిన్న శ్రీవారిని 69,587 మంది భక్తులు దర్శించుకోగా 28,645 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox