తన భూమిని వేరొకరి పేరు మీద మార్చారని జవాన్ ఆవేదన
సమస్య పరిష్కారానికి అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్న సీఆర్పీఎఫ్ జవాన్ శంకర్
జయశంకర్ భూపాల పల్లి: రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా ఒకరి భూమిని మరొకరిపై మార్చడంతో ఎంఆర్వో కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని ఓ ఆర్మీ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిని మరొకరి పేరు మీద పట్టా చేశారని ఆర్మీ జవాన్ శంకర్ తెలిపారు. జయశంకర్ భూపాల పల్లి జిల్లా రేగొండ మండలం రేపాకకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ శంకర్ కు పది గుంటల భూమి ఉంది. తన భూమిని పగడాల హరీష్ పేరుమీద రెవెన్యూ అధికారులు పట్టా చేశారని శంకర్ తెలిపారు. 20 రోజులు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరో పది రోజుల్లో తాను విధుల్లోకి వెళతానని తన సమస్యను వెంటనే పరిష్కరించాలని జవాన్ శంకర్ కోరుతున్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox