భాజపా హయాంలో ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగం: కూనంనేని

రాజకీయ కక్షతోనే నేతలపై ఈడీ దాడులన్న కూనంనేని

హైదరాబాద్: ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యవస్థలన్నీ దుర్వినియోగం అవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ఈడీతోని దాడులు చేయిస్తున్నారని సాంబశివరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేసే దాడులు భాజపా నాయకులపై ఎందుకు జరగట్లేదని కూనంనేని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox