డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి: మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఇళ్ల పనుల పురోగతి, లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన మంత్రి

హైదరాబాద్: పూర్తియిన రెండు పడక గదుల ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని రోడ్లు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రెండు పడకల గదుల ఇళ్ల పనుల పురోగతి, లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లు అందేలా చూడాలని వారు నిర్దేశించారు. తుది దశలో ఉన్న ఇళ్ల పనులు వెంటనే పూర్తి చేయాలని యంత్రంగానికి సూచించారు. ఎక్కడ అర్హత లేని వారికి ఇప్పటికే ఇళ్లు కలిగి ఉన్నవారికి ఇళ్లు రాకుండా చూసుకోవాలని నిర్దేశించారు. పేదల ఆత్మగౌరవంగా పరిగణిస్తున్న పక్కా ఇళ్లను రాజీపడకుండా కట్టాలని పేర్కొన్నారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox