భాజపా అధికారంలోకి రాగానే 26 కులాలను తిరిగి బీసీల్లోకి చేర్చుతాం: ఎంపీ లక్ష్మణ్

రాష్ట్రం ఏర్పడ్డాక ఏకపక్షంగా వారిని బీసీ కులలా నుంచి తొలగించారని వ్యాఖ్య

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ 26 బీసీ కులాలను తొలగించారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన 26 కులాలకు చెందిన వారు హైదరాబాద్ లో స్థిర పడ్డారని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఏకపక్షంగా వారిని బీసీ కులలా నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. 26 కులాల పూర్వీకులు 50 ఏళ్ల క్రితమే హైదరాబాద్ లో స్థిరపడ్డారని పేర్కొన్నారు.

తొలగించిన 26 కులాలను బీసీ జాబితాలోకి చేర్చేందుకు చొరవ చూపాలని గవర్నర్ కు వినతి పత్రం అందించారు. బీసీ జాబితాలోకి తీసుకునే వరకు పోరాడుతామని ఆయన హెచ్చరించారు. భాజపా అధికారంలోకి రాగానే ఆ 26 కులాలను తిరిగి బీసీల్లోకి చేర్చుతామని ఎంపీ లక్ష్మణ్ వాపోయారు. ఎన్నికల తర్వాత భాజపా అధికారంలోకి వస్తుంది. బీసీ జాబితాలోని 26 కులాలను కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox