అమరావతి: అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బైకును ఢీకొన్న అనంతరం కల్వర్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమం కావడంతో కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉందని వైద్యులు వెల్లడించారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox