ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
హర్షం వ్యక్తం చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు
హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసింది. దీని ద్వార వివిధ కేటగిరీల్లో తొమ్మిది వైద్య కళాశాలలు, అనుబంధ హాస్పిటళ్లకు పోస్టులను మంజూరు చేసింది.
వీటిలో ఒక్కో కాలేజీకి 433 పోస్టులను కేటాయించింది. ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్లోని మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లకు ఈ పోస్టులను మంజూరు చేసింది.
వైద్య కళాశాలలకు కొత్తగా పోస్టులు మంజూరు చేయడంపట్ల మంత్రి హరీశ్ రావు (Harish Rao)హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడిందని అన్నారు. అందరికీ సరైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు (Harish Rao)ట్వీట్ చేశారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox