బైక్ స్టంట్ చేసిన స్నేహితులు .. గాల్లో కలిసిన ప్రాణాలు
హెల్మెట్ పై ఉన్న కెమెరాలో రికార్డైన ప్రమాద ఘటన
చెన్నై: సోషల్ మీడియాలో మెరిసి ఫేమస్ అవుదామనుకున్న ఇద్దరు స్నేహితుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాద సంఘటన చెన్నైలోని పెరియార్నగర్లో చోటుచేసుకుంది. వారు చేసిన స్టంట్ వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం... కరుణానిధి నివాసితులైన ప్రవీణ్ (19), ఆరి (17) స్థానికంగా బైక్ రైడ్ కోసం వెళ్లారు.
ప్రవీణ్ యూట్యూబ్ లో బైక్ అడ్వెంచర్ చేస్తున్నాడు. స్నేహితుడు ఆరితో కలిసి బైకుపై 114 స్వీడ్ తో వెళ్లాడు. అంతే అదుపుతప్పిన బైక్ ను వ్యాన్ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. హెల్మెట్కు కెమెరాను బిగించి బైక్ను నడిపారు, ఊహించని విధంగా బైక్ వ్యాన్ ని ఢీకొట్టింది.
దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. హెల్మెట్ లో పెట్టిన కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. మృతుడు బైక్ విన్యాసాలు చేసేందుకు, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేందుకు బైక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox