నిజామాబాద్: జిల్లాలోని ఖలీల్వాడి ప్రాంతంలో ఉన్న మాడ్రన్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థినిల పట్ల ఉపాధ్యాయుడి ప్రవర్తన అసభ్యకరంగా ఉండటంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో శుక్రవారం విద్యార్థిని తమ తల్లిదండ్రులను తీసుకుని పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు రమణ (బయోలాజికల్)ను విద్యార్థినిలు, తల్లిదండ్రులు దేహాశుద్ది చేశారు. ఉపాధ్యాయుని రూపంలో ఉన్న ఈ కామంధుడు కొంతకాలంగా విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox