అత్యధికంగా ఇష్టపడే వంటకంగా బిర్యానీ.. మసాలా దోశ

ఏడాదంతా బిర్యానీ ఘుమఘుమలే!

హైదరాబాద్: భోజన ప్రియులు అత్యధికంగా ఇష్టపడే వంటకంగా బిర్యానీ నిలుస్తోంది. ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ గణాంకాల ఆధారంగా 2022లో మనదేశంలో అత్యధిక ఆర్డర్లు పొందిన ఆహారంగా చికెన్‌ బిర్యానీ అగ్రభాగాన నిలిచింది. వరుసగా ఏడేండ్లు ఈ ఖ్యాతిని మూటగట్టుకోవడం విశేషం. దేశవ్యాప్తంగా నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డరిచ్చారట. అంటే సెకనుకు 2.28 బిర్యానీ ఆర్డర్లు బుక్‌ అవుతున్నట్లు సర్వేలో తేలింది. బిర్యానీ తర్వాత అత్యధిక ఆర్డర్లు సొంతం చేసుకున్న వంటకం మసాలా దోశ. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్‌ ఫ్రైడ్‌రైస్‌, పనీర్‌ బటర్‌ మసాలా, బటర్‌ నాన్‌, వెజ్‌ ఫ్రైడ్‌ రైస్‌లు నిలిచాయి. మొత్తంగా గతేడాది చికెన్‌ బిర్యానీ టాప్ లో నిలిచింది. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం