మందు బాబులకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి ఆఫర్.!
మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగించిన ప్రభుత్వం
అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. సంక్రాంతి పండుగల్లోనూ ఆదాయం పెంచు కునేందుకు మరోసారి మద్యం దుకాణాల సమయవేళలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. సాధా రణంగా ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాల్లో మద్యం విక్రయిస్తారు.
అయితే పండుగల సందర్భంగా ఈ నెల 13వ నుంచి 16వ తేదీ వరకు రాత్రి సమయం ఓ గంట పొడిగించారు. ఈ మేరకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఉన్నతాధికారులు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఈ ఆదేశాల జారీ చేశారు. ఇదిలా ఉండగా, ప్రత్యేక రోజులు వస్తున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. మద్యం అమ్మ కాలను పెంచడమే లక్ష్యంగా దుకాణాల సమయవేళలను పెంచుతోంది.
ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 31వ తేదీ రాత్రి, జనవరి 1వ తేదీ రాత్రి 11 గంటల వరకు దుకాణాలు, అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లలో మద్యం విక్రయాలు సాగించవచ్చని ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ రెండు రోజుల్లోనే గత సంవత్సరంతో పోల్చుకుంటే రెండింతల మద్యం అమ్మకాలు సాగాయి.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox