ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (డీఏ/డీఆర్) 2.73 శాతం పెంపు
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (డీఏ/డీఆర్) 2.73 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. 2021, జులై నుంచి రాష్ట్ర ప్రభుత్వం డీఏ చెల్లించనుంది. జనవరి ఫించనుతో కలిపి పింఛనుదారులకు ఫిబ్రవరిలో డీఏ చెల్లించనుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్ నెలఖారు వరకు బకాయిలు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox