నిర్మల్: జిల్లాలోని బాసరలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులతో కలిసి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి మానసతో పాటు పిల్లలు బాలాదిత్య, భవ్య శ్రీ మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికి తీశారు. మృతులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox