ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన
గాంధీభవన్ వద్ద నిరసనకు దిగిన అభ్యర్థులు
హైదరాబాద్: ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో గాంధీభవన్ వద్ద ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వందలాదిగా అభ్యర్థులు గాంధీ భవన్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యర్థులు నినాదాలు చేశారు. 1600/ 800 మీటర్లు క్వాలిఫై ఐనా అభ్యర్థులను మెయిన్స్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడలేని విధంగా లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టారని, పాత పద్ధతిలో లాంగ్ జంప్ 3.8 మీటర్లు పెట్టాలన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని ఎన్ఎస్యూఐ నాయకులు డిమాండ్ చేశారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox