అందుకే తొలగించాం: గూగుల్ సీఈవో
గూగుల్ ఉద్యోగులను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన సుందర్ పిచాయ్
గూగుల్ సంస్థ 12 వేల మంది తొలగింపుపై సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. కంపెనీ ప్రగతి మందగించిందని, సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కంపెనీ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాత ఆరు శాతం ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆలస్యం జరిగితే అప్పుడు సమస్య మరింత జటిలం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.
ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ కంపెనీగా గుర్తింపు కలిగి ఉన్న గూగుల్ కూడా ఖర్చుల పేరుతో ఉద్యోగులను తొలగించడం మీద ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. రాబోయే ఆర్థిక మాంద్యానికి పెద్ద కంపెనీలు తొలగించడమే నిదర్శనం అని కొంతమంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాగా గూగుల్ తో పాటు మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్లు తమ ఉద్యోగులను తొలగించడం తెలిసిందే.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox