ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రస్తుతం దేశమంతటా హాట్ టాపిక్ గా ఉంది. తాజాగా దీనిపై ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ ఛైర్మన్ ఆదిష్ అగర్వాలా స్పందించారు. “జాతీయ, అంతర్జాతీయ సమస్యల్ని పరిష్కరించడంలో మోదీ.. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆయనంటే విదేశీ ఏజెన్సీలు అసూయగా ఫీలవుతున్నాయి. ఈ డాక్యుమెంటరీ విషయంపై అంతర్జాతీయ కుట్ర కోణంలో 360డిగ్రీల దర్యాప్తు చేయించాలి" అని ఆయన కోరారు.
గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడ అక్కడి వ్యవస్థలను ఆయన గోద్రా అల్లర్లకు ఎలా పరోక్షంగా కారణమయ్యారనే కోణంలో బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా గోద్రా అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. తాజాగా బీబీసీ డాక్యుమెంటరీ దేశ అత్యున్నత న్యాయస్థానం నిబద్ధతను ప్రశ్నించేలా ఉందని కేంద్రం బ్యాన్ విధించింది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox