'కొవ్వు కరిగించుకునేందుకే లోకేశ్ పాదయాత్ర'
లోకేష్ యాత్రపై ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు. చేశారు. “టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర ప్రజల కోసం కాదు. కొవ్వు కరిగించుకోవడం కోసం. పాదయాత్ర చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. రాష్ట్రంలో ఈరోజు ప్రజలకు ఏం కష్టం ఉందని లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు?" అని వ్యాఖ్యానించారు.
కాగా టీడీపీ యువనేత నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర నేపథ్యంలో లోకేష్ రేపటి టూర్ షెడ్యూల్ ను టీడీపీ ఖరారు చేసింది. రేపు మధ్యాహ్నం 1.45 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో 3.30కు కడపకు చేరుకుని సాయంత్రం 5.15కు అమీన్ పీర్ దర్గాను సందర్శిస్తారు. సాయంత్రం గం.6.30ని.కు రోమన్ కేథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox